Skip to content

సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ శ్రీ టొమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్‌కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టు అయింది. అల్లు అర్జున్ మన దేశ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ అందులోని విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ చిత్రపటం బహూకరించడం భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంభాషణకు ప్రతీకగా నిలిచింది. ఇది వారసత్వం, ఆధ్యాత్మికత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఉన్న ఉమ్మడి…

Read more

‘శ్రీమహా విష్ణు’ ఫస్ట్ లుక్ రిలీజ్

'సిద్ధార్థ్ రాయ్' చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు. పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'శ్రీమహా విష్ణు' అనే టైటిల్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. సున్నితమైన ఆయిల్ పెయింటింగ్ స్టయిల్ లో అందంగా డిజైన్ చేసిన ఈ…

Read more

పది లక్షల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చిన చిరంజీవి

'మన శంకర వర ప్రసాద్ గారు' బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి, తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డుతో పాటు పది లక్షల నగదు బహుమతి అందుకున్న చిరంజీవి, ఆ మొత్తాన్ని తన చిరకాల సామాజిక సంక్షేమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వారి దైనందిన అవసరాలకు మద్దతుగా చిరంజీవి 'సర్వ్ ఫౌండేషన్'కు విరాళం అందించారు. “గేమ్ ఛేంజర్” షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధులు ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆశపడగా, చిరంజీవి ఆ కోరికను నెరవేర్చారు. 30…

Read more

“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల 

కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై యతింద్ర మరియు రమ్య దినేష్ హీరో హీరోయిన్ గా ఏ ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న కామెడీ డ్రామా చిత్రం "పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ". అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పలువురు ప్రముఖ దర్శకులు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ""పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చిత్రం. కేవలం ఒక రాత్రి సమయంలో ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ. మా చిత్ర హీరో యతీంద్ర ఒక విభిన్నమైన బ్రాహ్మణ గెట్ అప్ లో కనిపిస్తారు. రేపు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా…

Read more

రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' మేకర్స్ బర్త్ డే, శ్రీరామ నవమిని పురస్కరించుకుని అభిమానులకు ఒక పవర్‌ఫుల్ కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో గ్లింప్స్ మొదలౌతుంది. ఆ తర్వాత విజువల్స్ ఆడియన్స్ ని కుస్తీ పోటీలోకి తీసుకువెళ్తాయి. అక్కడ దుమ్ము,…

Read more

ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోనీ…

Read more

మన్యం ధీరుడుకు మలేషియన్ ఉగాది అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం…

Read more

లక్ష్మీ మంచు – గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సహకార అవకాశాల అన్వేషణ హైదరాబాద్, తెలంగాణ — టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ మంచు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని, దేవేంద్ర విద్యాలయ డైరెక్టర్ విజయేందర్ గౌడ్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” కార్యక్రమంతో సంయుక్తంగా పనిచేసే అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థాపించబడుతున్న సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా సమానమైన, నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ లక్ష్యాలను అనుసంధానించే అంశంపై ప్రధానంగా చర్చించారు. యంగ్ ఇండియా కార్యక్రమం SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే…

Read more

‘బైకర్’ మూవీని ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ రెడ్డి సమర్పణలో ఈ మూవీని అభిలాష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రని పోషించగా.. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మదనపల్లిలోని మిట్స్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. శర్వానంద్ మాట్లాడుతూ .. ‘జీవితం అనేది సినిమాలాంటిది కాదు. జీవితంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు.. కానీ స్ట్రగుల్స్ మాత్రం ఉంటాయి. జీవితంలో కన్ఫ్యూజర్, క్రైయింగ్,…

Read more

నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రం సుయోధన…సాయి కుమార్

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం "సుయోధన". వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ - నేను ఈ సినిమాలోకి రావడానికి కారణం…

Read more